Thursday, April 25, 2024

పుట్టా మధు భార్య పుట్టా శైలజకు నోటీసులు

మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు భార్య మంథని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పుట్టా శైలజకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ 41 కింద పోలీసులు పుట్టా శైలజకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వామన్‌రావు మర్డర్ కేసులో విచారణకు హాజరు కావాలని కోరడంతో ఆమె ఆదివారం నాడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసుల ముందు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా వామన్‌రావు దంపతుల హత్య కేసు విషయంపై రెండోరోజు పుట్టా మధును పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement