Friday, April 19, 2024

Breaking: జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు పర్మిషన్

ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌లు ఆ పార్టీ ఎంచుకున్న ప్ర‌దేశంలోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు ఆవిర్భావ వేడుక‌ల‌కు ఏపీ పోలీసుల నుంచి బుధవారం అనుమ‌తి కూడా వ‌చ్చేసింది. తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు అనుమతినిస్తూ పోలీసులు ఉత్త‌ర్వులు జారీచేశారు. ఇదిలా ఉంటే.. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభా వేదికగా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. కీలకమైన కార్యాచరణ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement