Sunday, March 24, 2024

క‌రోనా నుంచి కోలుకున్న పోచారం.. మ‌రికొన్ని రోజులు హోం క్వారంటైన్ లో..

రీసెంట్ గా క‌రోనా బారిన ప‌డ్డారు తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ నెల 24 నుండి ఆయ‌న హాస్ప‌ట‌ల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి తర్వాతే పోచారంకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న క‌రోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో పోచారంకు నెగెటివ్ వచ్చింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement