Thursday, April 25, 2024

గురు రవిదాస్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

గురు రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశ్రమ్ ధామ్ మందిరంలో నిర్వహించిన ‘షాదాబ్ కీర్తన్​’లో మోదీ పాల్గొన్నారు. కాగా, పంజాబ్​లోని లక్షలాది మంది ప్రజలు గురు రవిదాస్​ జయంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈ జయంతి కారణంగానే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. నిజానికి ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement