Tuesday, April 16, 2024

International Airport: ఆసియాలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్.. ప్రధాని మోడీ శంకుస్థాపన

ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. గ్రేటర్ నోయిడాలోని జేవార్‌లో జరిగిన కార్యక్రమంలో యూసీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. విమానాశ్రయ నిర్మాణం 1,330 ఎకరాల విస్తీర్ణంలో జరగనుంది. దీన్ని 2024 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయంగా రికార్డు సృష్టించనుంది. దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement