Friday, April 19, 2024

కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న ప్రధాని మోదీ

కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు కొవాగ్జిన్ టీకా రెండో డోసు ఇచ్చారు. గత నెల ఒకటో తేదీన కరోనా టీకా తొలి డోసు తీసుకున్న 37 రోజుల తర్వాత ఈ ఉదయం రెండో డోసు తీసుకున్నారు మోదీ. ఎయిమ్స్‌లో ఈ ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను. వైరస్‌ను ఓడించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. టీకా వేయించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరు వెంటనే టీకా తీసుకోండి. కొవిన్ యాప్ ద్వారా టీకా కోసం రిజిస్టర్ చేసుకోండి అని ఆ ట్వీట్‌లో మోదీ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement