Friday, April 19, 2024

స్వ‌చ్ఛ భారత్ లో ఆ సిటీ నెంబర్ వన్ః ప్రధాని మోదీ

క్రీడల పట్ల చూపించే అభిరుచే మేజర్​ ధ్యాన్​ చంద్​కు ఇచ్చే గొప్ప నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం మ‌న్ కీ బాత్‌లో మోదీ క్రీడారంగ అంశాల‌ను ప్ర‌స్తావించారు. దాదాపు 40 ఏళ్ల త‌ర్వాత ఈ ఏడాది ఒలింపిక్స్‌లో భార‌త హాకీ జ‌ట్టు మెడ‌ల్ సాధించింద‌ని చెప్పారు. ధ్యాన్ చంద్ మ‌న మ‌ధ్య‌లో లేక‌పోయినా ఆయ‌నకు ఈ విష‌యం తెలిస్తే ఎంత‌గా సంతోషిస్తారో మ‌నం ఊహించుకోవ‌చ్చ‌ని అన్నారు. దేశ యువ‌తకు క్రీడా రంగం ప‌ట్ల ఎంత ఆద‌ర‌ణ ఉందో మ‌నం చూస్తున్నామ‌ని చెప్పారు. మ‌న దేశ‌ క్రీడాకారులు సాధిస్తోన్న విజ‌య‌వాలు ఇక్కడితో ఆగిపోకూడ‌దన్నారు. మ‌న గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోని క్రీడా మైదానాల‌న్నీ యువ‌త‌తో నిండిపోవాలి. అంద‌రూ క్రీడ‌ల్లో పాల్గొన‌డంతోనే మ‌న‌ ప్ర‌తిభ‌ను పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించ‌గ‌లుగుతామ‌ని చెప్పారు. దేశం సాధించే ప్ర‌తి ప‌త‌కం ఓ ప్ర‌త్యేక‌మైన విష‌య‌మేన‌ని చెప్పారు.

దేశంలో ఇప్ప‌టికి 62 కోట్ల మంది క‌నీసం ఒక్క‌డోసు టీకా వేయించుకున్నార‌ని మోదీ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా నిబంధ‌న‌ల‌ను అంద‌రూ పాటించాల్సిందేన‌ని సూచించారు. క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో స్వ‌చ్ఛ‌భార‌త్ అంశాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ స్వ‌చ్ఛ భార‌త్ ర్యాంకుల్లో కొన్నేళ్లుగా నంబ‌ర్ 1గా నిలుస్తోంద‌ని గుర్తు చేశారు. అంద‌రూ స్వ‌చ్ఛ భార‌త్‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండిః పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Advertisement

తాజా వార్తలు

Advertisement