Friday, April 19, 2024

కేదార్ నాథ్ కు ప్రధాని మోదీ..

ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. నవంబర్ 5న రూ.250 కోట్ల విలువైన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును పరిశీలించి.. ప్రారంభించనున్నారు. ఈనెల 7న ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రిషికేశ్‌లోని ఆల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)ను సందర్శించారు. ఈ సందర్భంగా నవంబర్ లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. దేవాలయంలో ప్రార్థనలు చేయడమే కాకుండా పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రూ. 150 కోట్ల విలువైన రెండవ దశ కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

కాగా, మోదీ 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కేదార్‌నాథ్‌ను అనేకసార్లు సందర్శించారు. అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత సంవత్సరం కేదార్‌నాథ్‌ను సందర్శించలేకపోయారు.

ఇది కూడా చదవండి: అలయ్ బలయ్.. ప్రాచీన వారసత్వం కాపాడాలి: వెంకయ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement