Friday, March 29, 2024

జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీలతో మోదీ చర్చ!

జమ్మూకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిపిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం రద్దు చేసి.. కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి నేటి వరకు అక్కడ ఎలాంటి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 24న జమ్మూకశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణ తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సహా ఇతర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement