Friday, April 26, 2024

ప్ర‌తి ఒక్క‌రికి డిజిట‌ల్ హెల్త్‌కేర్ ఐడీ… కొత్త స్కీమ్ ప్రారంభించనున్న మోడీ

దేశంలో ఆధార్ కార్డ్ మాదిరిగా త్వ‌ర‌లో ప్ర‌తి ఒక్క‌రికి డిజిట‌ల్ హెల్త్‌కేర్ ఐడీ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క స్కీం ప్ర‌ధాన్‌మంత్రి డిజిట‌ల్ హెల్త్ మిష‌న్ (పీఎం-డీహెచ్ఎం) ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించ‌నున్నారు.

గ‌తేడాది ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పైల‌ట్ ప్రాజెక్టుగా పీఎం-డీహెచ్ఎంను ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం అండ‌మాన్ నికోబార్, చండీగ‌ఢ్‌, దాద్రా అండ్ న‌గ‌ర్ హ‌వేలీ, డామ‌న్ అండ్ డ‌యూ, ల‌డ‌ఖ్‌, ల‌క్ష‌ద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఈ ప‌థ‌కం అమలవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement