Saturday, April 20, 2024

చ‌లికి త‌ట్టుకోలేక‌.. బైక్ పై కుంప‌టి

బైక్ పై వెళ్లే స‌మ‌యంలో చ‌లి నుండి ఉప‌శ‌మ‌నం పొందేందుకు వినూత్న ఆలోచ‌న చేశారు ఇద్ద‌రు యువ‌కులు. బైక్‌ వెనుకవైపు చిన్న కుంపటి అమర్చి అందులో మంటపెట్టి చలి కాచుకుంటూ రోడ్డుపై చక్కర్లు కొట్టారు. రోడ్డు పొడవునా ఉన్న ప్రజలు ఈ యువకులను విచిత్రంగా చూస్తూ.. వీడియోలు తీసి నెట్టింట పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. కొందరు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. అయితే, ప్రయాణ సమయాల్లో మాత్రం ప్రజలు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్‌పై వెళ్లేవారైతే అంతే ఇక.. గజగజ వణికిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement