Saturday, April 20, 2024

Telangana: పీజీ డెంటల్‌ యాజమాన్య కోటా సీట్లు.. భర్తీ కోసం 10 నుంచి వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: పీజీ దంత కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల10న గురువారం రెండవ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ దంద కళాశాలల్లో ఎండీఎస్‌ యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 10న ఉదయం 6 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement