Monday, April 15, 2024

బాదుడే.. బాదుడు: హైదరాబాద్ లో సెంచరీ దాటిన డీజిల్ ధర

దేశంలో చమరు ధరలు మండిపోతున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు  పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.77 కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109. 25 చేరగా.. డీజిల్ ధర రూ.99. 55 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107. 40 చేరగా.. డీజిల్ ధర రూ. 100. 13కు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.60కు చేరగా.. డీజిల్ ధర రూ. 101. 74 కు చేరింది. కాగా, పెట్రోల్‌ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: అమరావతికి వెయ్యి కోట్లు వస్తాయా?

Advertisement

తాజా వార్తలు

Advertisement