Wednesday, April 24, 2024

Flash: మ‌రోసారి పెట్రో పిడుగు.. నేడు పెట్రోల్‌పై 89 పైస‌లు, డీజిల్‌పై 86 పైస‌లు పెంపు

దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ‌భ‌గ‌ మండిపోతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ రోజు లీట‌ర్ పెట్రోల్‌పై 89 పైస‌లు, డీజిల్‌పై 86 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌తో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 111.80కి చేరింది. డీజిల్ ధ‌ర రూ. 98.10గా ఉంది. ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.61 కాగా, డీజిల్ ధ‌ర రూ. 89.87, ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 113.35 కాగా, డీజిల్ ధ‌ర రూ. 97.55గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement