Thursday, April 25, 2024

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధ‌ర‌లు

దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయ చ‌మురు కంపెనీలు వ‌రుస‌గా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. సోమ‌వారం పెట్రోల్, డీజిల్‌పై 26 పైసలు, 33 పైసల చొప్పున పెరిగాయి. తాజాగా మ‌ళ్లీ 27 పైస‌లు, 20 పైస‌ల చొప్పున పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.91.80కు, డీజిల్ ధ‌ర రూ.82.36కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.98.12, డీజిల్ రూ.89.48, చెన్నైలో పెట్రోల్‌ రూ.93.62, డీజిల్ రూ.87.25, కోల్‌క‌తాలో పెట్రోల్ రూ.91.92, డీజిల్ రూ.85.20కు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement