Wednesday, April 24, 2024

పెస‌ల‌పాడు ఎన్ కౌంట‌ర్ బూట‌కం – మావోయిస్టు అగ్ర‌నేత జ‌గ‌న్ లేఖ విడుద‌ల‌

డిసెంబ‌ర్ 26న జ‌రిగిన పెస‌ల‌పాడు ఎన్ కౌంట‌ర్ బూట‌కం అని ఆరోపించారు మావోయిస్టు అగ్ర‌నేత జ‌గ‌న్. ఈ మేర‌కు లేఖ రాశారు. అమాయ‌క ఆదివాసీల‌ను కాల్చి చంపి ఎన్ కౌంట‌ర్ అని క‌ట్టు క‌థ అల్లార‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే ల‌క్ష్యంతో టీఆర్ ఎస్ స‌ర్కార్ , పోలీసులు త‌ప్పుడు ప్ర‌చారాన్ని చేస్తున్నార‌న్నారు. సిరిసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డికి మావోయిస్టులు లేఖ రాసినట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అతడి తప్పుడు లేఖ అడ్డుపెట్టుకుని పోలీసుల రక్షణ కోరాడని మావోయిస్టు నేత జగన్ వివరించారు. లక్ష్మారెడ్డి ద్వారా మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలను కోవర్టులుగా వాడుకుంటే కోర్స రమేశ్ కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ తప్పుడు ప్రచారం మానుకోవాలని స్పష్టం చేశారు. గత నెలలో తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పెసలపాడు అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement