Wednesday, April 24, 2024

ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బిజెపిని తిర‌స్క‌రించిన ప్ర‌జ‌లు.. సీఎం కేసీఆర్

హైదరాబాద్ – ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తక్షణం ప్రధాని నరేంద్ర మోడీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. శనివారం ప్రగతి భవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి ఆయన సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని.. కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలాగా వుందని కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామని సీఎం స్పష్టం చేశారు.  బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం చాలా ఇబ్బంది పెడుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  ఆర్ధిక పరిమితులు విధించడం, దాడులతో వేధించడం వంటి పనులకు బీజేపీ ఒడిగడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. దీనిని యావత్ దేశం చూస్తూ వుందన్నారు. ఢిల్లీలో మూడు సార్లు ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీని సాధించిందని.. అయినా మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారని కేసీఆర్ దుయ్యబట్టారు. చివరికి సుప్రీంకోర్ట్‌కు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

.ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ముప్ప‌తిప్ప‌లు పెడుతుంద‌ని ఆరోపించారు. సోష‌ల్ మూమెంట్ నుంచి వ‌చ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ అని అన్నారు. ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బిజెపిని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించార‌ని చెప్పారు. కాగా గెలిచిన మేయ‌ర్ ని బాధ్య‌త‌లు చేపట్ట‌కుండా బిజెపి అడ్డుకుంద‌ని మండిప‌డ్డారు. మూడుసార్లు అద్భుత‌మైన మెజార్టీతో ఆప్ గెలిచింద‌న్నారు. లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ని తెచ్చి ఎన్నిక‌యిన ప్ర‌భుత్వంపై బిజెపి కూర్చొపెట్టింద‌న్నారు. ఈ ర‌క‌మైన ప‌ద్ద‌తి దేశానికి.. బిజెపికి మంచిది కాద‌న్నారు. అధికారుల బదిలీలన్ని ఢిల్లీ ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని సీఎం చెప్పారు. ఆర్ధినెన్స్‌ ఉపసంహరించుకునే పోరాటంలో అరవింద్ కేజ్రీవాల్‌కు బీఆర్ఎస్ మద్ధతుగా వుంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్ధితులు వున్నాయన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement