Thursday, April 18, 2024

AP: పెదబయలు తహసీల్దార్‌ ఆత్మహత్య..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా పెదబయలు మండలం తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని నెలలుగా తహసీల్‌ కార్యాలయం పైగదిలో ఉంటున్న ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈరోజు ఆయన గదికి వెళ్లిన సిబ్బంది పిలిచినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో గది కిటికి నుంచి పరిశీలించగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో సిబ్బంది ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్‌ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement