Tuesday, April 23, 2024

బోర్డర్ వద్ద ఎమ్మెల్యేకు ఓ రూల్.. సామాన్యులకు మరో రూల్

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినందున… గత మూడు రోజుల నుండి తనను కలిసిన నాయకులు, కార్యకర్తలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు.

కాగా సాధారణ ప్రజలు ఎమర్జెన్సీలో ఉంటే ఏపీ నుంచి తెలంగాణ వెళ్లాలంటే ఆపుతున్న పోలీసులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు బోర్డర్ నిబంధనలు అడ్డురావా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా హైదరాబాద్ ఆస్పత్రిలో బెడ్ ఉంటేనే ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఏపీ ప్రజలను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement