Friday, April 19, 2024

ఎస్ఐ, త‌హ‌సీల్దార్‌పై పెట్రోల్ దాడి.. ఏపీవోకు అంటుకున్న నిప్పు (వీడియో)

జగిత్యాల (ప్ర‌భ న్యూస్‌): జ‌గిత్యాల జిల్లాలో అధికారులపై యువకుడు పెట్రోల్​ దాడిచేసిన ఘ‌ట‌న జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఎంపీవోకు మంట‌లు అంటుకున్నాయి. బీర్పూర్‌ మండలం తుంగూరులో అధికారులపై ఈ దాడి జరిగింది. తుంగూర్ గ్రామానికి చెందిన తిరుపతి -గంగాధర్ మధ్య గత ఏడాది నుండి దారివిష‌యంలో వివాదం కొన‌సాగుతోంది. ఈ దారి వివాదం దృష్ట్యా గంగాధర్ రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టాడు..అయితే ఆ కర్రలు తొలగించేందుకు వెళ్లిన ఎస్‌ఐ, తహసీల్దార్‌, ఎంపీవోపై ఈ దాడి జ‌రిగింది. ఎస్‌ఐ, తహసీల్దార్‌, ఎంపీవోపై పెట్రోల్‌ పిచికారి చేసి ఓ యువకుడు నిప్పంటించాడు. ఎంపీవోకు నిప్పంటుకుని తీవ్ర‌ గాయాలయ్యాయి. హుటాహుటిన అత‌డిని జగిత్యాల ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఈ వీడియో కోసం www.prabhanews.com ని క్లిక్​ చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement