Wednesday, April 17, 2024

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నవజోత్ సింగ్‌ సిద్ధు నియామకం..

ముందు నుంచి అనుకున్నట్లుగానే పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్‌ సిద్ధు నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ మేరకు ఈ నియామకాలు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగత్‌ సింగ్‌ గిల్జియన్, సుఖ్‌విందర్‌ సింగ్‌ డానీ, పవన్‌ గోయల్‌, కుల్జిత్‌ సింగ్‌ నాగ్రాను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. కుల్జిత్‌ సింగ్‌ను సిక్కిం, నాగాలాండ్‌, త్రిపుర పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిపారు. పంజాబ్‌ కాంగ్రెస్ చీఫ్‌ పదవి నుంచి వైదొలగిన సునీల్‌ జాఖర్‌ సేవలపై పార్టీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు అందులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రూ 100 ఇచ్చి సెల్ఫీ దిగండి: మంత్రి ఉషా ఠాకూర్

Advertisement

తాజా వార్తలు

Advertisement