Tuesday, March 26, 2024

ఐశ్వ‌ర్య‌రాయ్ ని ఐదుగంట‌ల‌పాటు విచారించిన ‘ఈడీ’

బాలీవుడ్ అందాల తార ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఐదు గంట‌ల పాటు విచారించింది. ప‌నామా పేప‌ర్ల వ్య‌వ‌హారంపై ఐశ్వ‌ర్య‌రాయ్ ని ప్ర‌శ్నించారు. ఫెమా నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించి విదేశాల్లో డ‌బ్బుని దాచుకున్నట్లు ఐశ్వ‌ర్య‌రాయ్ పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కాగా గ‌తంలో రెండు సార్లు ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు పంపింది. ఈమెకు ఐశ్వ‌ర్యారాయ్ వాయిదాని కోరారు. మరోసారి సమన్లు పంపడంతో ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత 15 ఏళ్లలో విదేశాల నుంచి అందుకున్న చెల్లింపులకు సంబంధించిన రికార్డులను ఐశ్వర్య రాయ్‌ సమర్పించినట్టు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement