Saturday, March 23, 2024

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్.. వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీ..

ప్ర‌భ‌న్యూస్ : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన పాటకు మంచి స్పందన వచ్చి, సినిమాపై అంచనాలు పెంచింది. ఇకపోతే ప్రభాస్‌ నటిస్తున్న మరోక చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఇందులో బాలివుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పడుకునె నటిస్తున్నారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు దీపికా హైదరాబాద్‌ చేరుకున్న‌ట్టు చిత్ర బృందం తెలిపింది.

సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందు తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రం షూటింగ్‌ కొంతకాలం క్రితమే మొదలైంది. అమితాబ్‌ పాల్గొన్న‌ కీలక సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ప్రభాస్ షూట్ తో జాయిన్ అవుతారు అని తెలిసింది. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్ షూటింగ్ పూర్త‌చేశారు. ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌ షూటింగ్‌లో సైతం పాల్గొంటున్నారు. ఇంకా పేరు నిర్ణయం కానీ, ప్రాజెక్ట్‌ కె పేరుతో రూపొందుతున్న నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో సైతం పాల్గొంటుండడం విశేషం. ఇంకా ఆయన నుండి ‘స్పిరిట్‌ ‘ సినిమా ప్రకటన కూడా వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement