Friday, March 29, 2024

పల్లె దవాఖానాలు..ప్ర‌జ‌ల ఆరోగ్యం ప్ర‌భుత్వ బాద్య‌త‌..మంత్రి హ‌రీశ్ రావు..

మంత్రి హ‌రీష్ రావు ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. త్వ‌ర‌లోనే ప‌ల్లె ద‌వాఖానాలు తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆశా కార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్ కార్డులను పంపిణీ చేశారు. వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కావాలని….ప్రోగ్రామ్ ఆఫీసర్లను నియమించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మండలం, గ్రామం వారీగా వ్యాక్సినేషన్ పై డిక్లరేషన్ ఇవ్వాలన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడ‌టం ప్రభుత్వ బాధ్యత అని… ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి పిలుపు ఇచ్చారు. నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని… ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువలో తేవాలనే లక్ష్యంగా కేసీఆర్ విజన్ కు అనుగుణంగా భవిష్యత్తులో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని వెల్లడించారు. ప్రతీ పల్లె ప్రాథమిక ఉప కేంద్రంలో స్టాఫ్ నర్సు, ఏఏన్ఏఎంలు, వైద్యులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement