Thursday, April 25, 2024

Huzurabad: కాంగ్రెస్‌, బీజేపీ భారీ డీల్.. రేవంత్ పై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్‌ను బీజేపీకి రూ. 25 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ కుమ్మక్కు కావడం వల్లే బీజేపీ గెలిచిందని తెలిపారు.  కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీచేయడం దేశంలో ఎక్కడా లేదని, కానీ హుజూరాబాద్‌లో జరిగిందని అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు 62 వేలకుపైగా ఓట్లు పోలయ్యాయని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా బరిలోకి దిగినప్పటికీ చివరికి బల్మూరి వెంకట్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా నిలిచిపోయారని విమర్శించారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసుకొన్న చీకటి ఒప్పందంతో కాంగ్రెస్‌ అభ్యర్థి 3 వేల ఓట్లను మాత్రమే సాధించారన్నారు. కాంగ్రెస్ నేతల నుంచి బల్మూరి వెంకట్ కు పూర్తిస్థాయి సహకారం లభించలేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు.

ఇది కూడా చదవండి: బస్టాండ్లలో గుట్కా బంద్‌.. ఆర్టీసీ సిబ్బందికి ఎండీ వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement