Thursday, April 25, 2024

Breaking: అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు.. గుడ్​ బై చెప్పిన రాంనాథ్​ కోవింద్​!

పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు శనివారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌లో వీడ్కోలు పలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు.

తన వీడ్కోలు కార్యక్రమంలో కోవింద్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కల్పించిన దేశ పౌరులకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతానన్నారు. పార్లమెంటులో చర్చ, అసమ్మతి హక్కులను వినియోగించుకునేటప్పుడు ఎంపీలు గాంధీ తత్వశాస్త్రాన్ని అనుసరించాలన్నారు. రాంనాథ్​ కోవింద్​ వీడ్కోలు కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కూడా హాజరయ్యారు.  కాగా, నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని ఆక్రమించిన తొలి గిరిజన మహిళగా ఆమె ప్రత్యేకత పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement