Thursday, April 18, 2024

మా కొడుకును చంపేశారు, పోలీసులు ప‌ట్టించుకుంట‌లేరు.. కేసీఆర్‌ను క‌లిసిన దంప‌తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తమ కుమారుడిని హత్యచేశార‌ని, ఈ విష‌యాన్ని ఎన్నిసార్లు విన్నవించినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము-లక్ష్మి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును సీఎం కేసీఆర్‌ ముందు వెల్లబోసుకునేందుకు శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. తమ కుమారుడిని హత్యచేశార‌ని ఫిర్యాదు చేసేందుకు ఎనిమిది నెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతి విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపి నేరస్థులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించినా ఉద్దేశ్యపూర్వకంగానే జిల్లా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆ దంపతులు ఆరోపించారు. నల్గొండ పోలీసులు స్పందించరని భావించే సీఎం కేసీఆర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ప్రగతిభవన్‌కు వచ్చామన్నారు. కాగా… పోలీసులు ఆ దంపతులను ప్రగతిభవన్‌లోకి అనుమతించకుండా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement