Saturday, April 20, 2024

ఆప‌రేష‌న్ ‘క‌మ‌ల్‌’.. ఢిల్లీ నుంచి తెలంగాణ కాంగ్రెస్​ నేతలకు పిలుపు, బీజేపీలోకి మ‌ర్రి శశిధర్​రెడ్డి?

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్​ ‘కమల్​’ని వేగవంతం చేసింది. ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ బీజేపీ నేతలు డీకీ అరుణ, చేరికల కమిటీ ఇన్​చార్జి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ఆధ్వర్యంలో తెలంగాణలోని పలువురు లీడర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారంలో స్వామీజీలతో బేరసారాలు నడిపి అడ్డంగ బుక్కైన బీజేపీ.. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్​ పార్టీ నాయకును బీజేపీలో చేర్చుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. దీనికిగాను నియోజకవర్గ స్థాయి లీడర్లను ఆహ్వానిస్తూ ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్​ జిల్లా నిర్మల్​ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ ముఖ్యనేతతో పాటు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది సీనియర్ల లీడర్లతో పాటు ఇద్దరు ఎమ్మెల్యలేను ఆహ్వానించినట్టు సమాచారం. బీజేపీలో చేరికల కోసం మంతనాలు జరపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్​ సీనియర్​ నేత మ‌ర్రి శశిధర్​రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీలో కనిపించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్​ పార్టీ అధిష్ఠానం, తెలంగాణ లీడర్లపై మర్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజీపీలో చేరడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదంతా వట్టిదేనని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement