Friday, March 29, 2024

Breaking: మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి కోట్లాది రూపాయ‌ల ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్‌.. ఈసీకి టీఆర్ ఎస్ ఫిర్యాదు

మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌కు మించి ఖ‌ర్చుపెడుతున్న విష‌యాన్ని టీఆర్ ఎస్ నేత‌లు ఈసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇవ్వాల ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాజ‌గోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అకౌంట్ నుంచి చౌటుప్ప‌ల్‌తో స‌హా నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురికి ల‌క్ష‌ల్లో ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయ‌ని.. ఈ మొత్తం దాదాపు 4.5కోట్ల దాకా ఉంటుంద‌ని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విష‌య‌మ్మీద ఈసీ ఎటువంటి చ‌ర్య తీసుకోనుందో చూడాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement