Thursday, April 25, 2024

ఏపీలో ఆన్ లైన్ లో టిక్కెట్ల అమ్మ‌కాలు – ఎల్-1గా నిలిచిన జ‌స్ట్ టికెట్స్ సంస్థ‌

ఇక‌పై సినిమా టికెట్లు ఆన్ లైన్ లోనే ల‌భించ‌నున్నాయి. ఆన్ లైన్ లో టికెట్ అమ్మ‌కాల‌కు టెండ‌ర్ల‌ను పూర్తి చేసింది జ‌గ‌న్ స‌ర్కార్. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ ధరకే లభించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలకు రెండు సంస్థలు పోటీ పడగా.. జస్ట్ టికెట్స్ సంస్థ ఎల్-1గా నిలిచినట్టు స‌మాచారం. ఏప్రిల్ 1 నుంచి ఆన్ లైన్ లో టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆన్ లైన్ లో టికెట్లను విక్రయించగా వచ్చిన డబ్బును ప్రభుత్వమే థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వనుంది. ఈ నిర్ణయంతో బ్లాక్ టికెట్స్ దందాకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement