Friday, March 29, 2024

పీజీ మెడికల్‌ సీట్ల భర్తీకి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ పీజీ 2021లో అర్హత సాధించిన విద్యార్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈనెల 15వ తేది ఉదయం 8 గంటలనుంచి 22వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయ డంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు.

ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదలచేస్తుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement