Thursday, April 18, 2024

పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడాది..భారీ బహిరంగ సభకి హాజరుకానున్న రజనీకాంత్..ఎన్టీఆర్

హార్ట్ ఎటాక్ తో గత ఏడాది కన్నుమూశారు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్.. కన్నడ నాట పవర్ స్టార్‌గా ఎదిగారు. హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడి అందరి మన్ననలు ప్రేమ అందుకుంటూ అందనంత ఎత్తుకు ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండె పోటుతో కన్నుమూశాడు. కాగా నవంబర్ 1న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ బిరుదుని అధికారికంగా ప్రకటించనుంది కర్ణాటక సర్కార్. ఈ కార్యక్రమానికి పలు చిత్ర పరిశ్రమలకు చెందన అగ్ర హీరోలు హాజరు కానున్నారు. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు. ఇంకా ఇతర సినీ పరిశ్రమల నుంచి అగ్రహీరోలు హాజరుకానున్నట్లు సమాచారం. హీరోగా ప్రేక్షకులను అలరించటమే కాదు సామాజిక సేవలోనూ అప్పు స్టారే. అంత మంచి వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ అనే ప్రతిష్ఠాత్మకమైన బిరుదును ఇచ్చి గౌరవించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement