Saturday, April 20, 2024

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో వెయ్యికిపైగా కేసులు

తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తున్నాయి. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. నిన్న 42,991 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,052 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 659 కొత్త కేసులను నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 116, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 240 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,033కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,84,023 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 6,75,132 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,858 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement