Thursday, April 25, 2024

Electric Buses: రోడెక్కిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

విద్యుత్తు వాహనాల తయారీలో అగ్రగామి, మేఘా ఇంజినీరింగ్ అనుబంధ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులు ప్రారంభమైయ్యాయి. గోవా రాష్ట్రంలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన సమావేశం సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

ఎలక్ట్రిక్ వాహనాల(EV) ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణపై రూపొందించాల్సిన విధివిధానాలపై గోవాలోని లాలిట్ గోల్ఫ్ & స్పా రిసార్ట్, కెనకోనాలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరైయ్యారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు వాహనాల తయారీపై వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్న దృష్ట్యా దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్ ను 300 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లో ఏర్పాటు చేయనున్న విషయం విదితమే. ఈ ప్లాంట్ ను అతి తక్కువ మానవ ప్రమేయం, పూర్తిస్థాయి ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పనున్నారు. బస్సులుతో పాటు త్రీ వీలర్స్, ట్రక్కులు, ఇతర వాహనాలు కూడా తయారు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement