Saturday, April 20, 2024

Aswaraopeta: అగ్ని ప్రమాదంలో వృద్ధుడు సజీవదహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం జరిగింది. అశ్వరావుపేటలోని వడ్డెర బజారులో ఉన్న ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు కొవ్వొత్తి అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పెద్దభిక్షం (80)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement