Wednesday, April 24, 2024

ఓల్డ్ సిటీలో దారుణం.. వైద్యం కోసం వ‌చ్చిన వారిపై బాబా అఘాయిత్యం..

పాత బ‌స్తీలో దారుణం చోటుచేసుకుంది. బాబా పేరుతో ఓ మాంత్రికుడు మ‌హిళ‌లు, యువ‌తుల‌పై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. బాబా ద‌గ్గ‌రి వ‌చ్చిన వారిపై చాలా కాలంగా ఘాతుకానికి పాల్ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. రెండు నెల‌లుగా అలా చేస్తున్నట్టు బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మంత్రాల పేరుతో ఓ బాబా.. ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ల‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనారోగ్యానికి గురైన త‌ల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్ద‌రు యువతులు.. పాత‌బ‌స్తీలోని ఓ బాబాను ఆశ్ర‌యించారు. త‌ల్లికి వైద్యం చేస్తూనే.. ఆమె కుమార్తెల‌పై బాబా క‌న్నేశాడు. అక్కాచెల్లెళ్ల‌పై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. వీరిలో ఒక‌రికి పెళ్లి కాగా, ఆమెకు విడాకులు కూడా ఇప్పించి దారుణాల‌కు పాల్ప‌డ్డాడు. ఆ వివాహిత‌పై బాబా కుమారుడు కూడా అత్యాచారం చేశాడు. అక్కాచెల్లెళ్ల‌ను మాన‌సికంగా, శారీర‌కంగా వేధించ‌డ‌మే కాకుండా, ఆర్థికంగా కుంగ‌దీశాడు బాబా. బాధిత యువ‌తుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాబాతో పాటు అత‌ని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement