Thursday, April 25, 2024

కేరళలో మరోసారి క్షుద్ర పూజలు .. త‌ప్పించుకున్న మ‌హిళ‌

పూజ పేరుతో మ‌హిళ‌ని మాంత్రికుడు న‌ర బ‌లిచ్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆమె చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంది. కొన్ని రోజులు భయంతో బయటకు రాని ఆ మహిళ ఓ స్నేహితుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఆమె భర్త తరుచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య దూరం పెరిగి భర్తతో విడిగా ప్రస్తుతం కొచ్చిలో ఉంటుంది. తన సమస్యలు పరిష్కారం కావడం లేదని.. ఏం చేయాలో తెలియడం లేదని స్నేహితుల దగ్గర వాపోయింది.

భర్తను వదిలేసిన మహిళకు ఓ స్నేహితుడు ఇటీవల బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు తిరువళ్లులోని ఓ మంత్రగాడి గురించి చెప్పాడు. అతడిని కలిస్తే నీ సమస్యలు తీరుతానని చెప్పడంతో ఆమె ఇటీవల మంత్రగాడిని కలిసింది. ఈ సమయంలోనే తన స్నేహితుడు.. మంత్రగాడు ఆ రాత్రి పూజ పేరుతో ఆమెను బలిద్దామని మాట్లాడుకున్నారు.ఈ మాటలను విన్న మహిళ పూజ మధ్యలో నుంచి లేచి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల పాటు భయంతో రహస్య ప్రాంతంలో తలదాచుకున్న మహిళ మరో స్నేహితుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసిన ఏడీజీపీకి సమర్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మంత్రగాడు.. మాయమాటలు చెప్పిన మహిళ స్నేహితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement