Monday, March 25, 2024

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి – నివాళుల‌ర్పించిన క‌ల్యాణ్ రామ్..జూనియ‌ర్ ఎన్టీఆర్

దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకుని ఆయ‌న‌కి నివాళుల‌ర్పించారు జూనియ‌ర్ ఎన్టీఆర్..క‌ల్యాణ్ రామ్..పుష్ప‌గుచ్ఛాలు ఉంచారు. టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్.. సదా మీ సేవలో.. అంటూ ఎన్టీఆర్ ఫొటోతో ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. అని రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement