Thursday, April 25, 2024

వైర‌ల్ గా మ‌హేశ్ బాబు..ఎన్టీఆర్ ప్రోమో..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షో న‌డుస్తోంది..ఇప్ప‌టికే ఈ షోలో ప‌లువురు సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. రామ్ చరణ్, సమంత ఈ షోకి కొత్త అందాన్ని తెచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సెటప్ అదిరిపోయింది అంటూ మహేశ్ బాబు కామెంట్ చేయగా, “నా రాజా” అంటూ ఎన్టీఆర్ ఉత్సాహంగా బదులివ్వడం ప్రోమోలో చూడొచ్చు. కాగా, తాను చెప్పిన సమాధానాన్ని ఎన్టీఆర్ అటు తిప్పి ఇటు తిప్పి తికమక పెట్టేందుకు ప్రయత్నించడంతో, “నీ కంటే మీ గురువు (కంప్యూటర్) గారే నయం” అంటూ మహేశ్ బాబు చమత్కరించాడు. ఇప్పుడీ ప్రోమో వైర‌ల్ అవుతుంది.

https://www.youtube.com/watch?v=DCwU8pNi9A8
Advertisement

తాజా వార్తలు

Advertisement