Thursday, April 25, 2024

NSE: చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్​షీట్

ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్​ షీట్​ నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. కో లొకేషన్​ స్కామ్​గా పేర్కొనే ఈ కేసులో మరో నిందితుడు, మాజీ గ్రూప్ ఆపరేటింగ్​ ఆఫీసర్​ ఆనంద్​ సుబ్రమణియన్​ పేరును ఛార్జ్​షీట్​లో జత చేసింది. ఈ విషయాన్ని సీబీఐ అధికారి వెల్లడించారు. ఛార్జ్​షీట్​ను ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ జిల్లా కోర్టులోని ప్రత్యేక సీబీఐ కోర్టులో సమర్పించినట్లు తెలిపారు. ఛార్జ్​షీట్​ను సమర్పించాం.. ఒకవేళ దర్యాప్తులో కొత్త విషయాలు, ఆధారాలు వెల్లడైతే ఇందుకు అనుబంధంగా మరో ఛార్జ్​షీట్​ను దాఖలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ తన ఛార్జ్​షీట్​లో పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకం, వెంటనే పదోన్నతులు వంటి విషయాల్లో కూడా చిత్ర అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement