Thursday, April 25, 2024

Telangana | నర్సింగ్‌, కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. 7వ తేదీ దాకా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎంఎ స్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా సీట్లకు భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వి శ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిసెంబర్‌ 1వ తేది ఉదయం 8 గంటల నుంచి 7వ తేది సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటి వైబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌. తెలంగాణ.జీఓవి.ఇన్‌లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement