Thursday, April 18, 2024

నో వ్యాక్సిన్ .. నో ఎంట్రీ ..

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవ‌రైనా మాస్క్ ని ఖ‌చ్చితంగా పెట్టుకోవాల్సిందేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. బ‌హిరంగ‌ప్ర‌దేశాలు , ఆఫీసుల్లో కూడా మాస్క్ లు త‌ప్ప‌ని స‌రి అని తెలిపింది. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం . వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని వైద్య శాఖ తెలిపింది. హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ కూడా తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేసింది. ఇదంతా ప్ర‌జ‌ల మేలుకోస‌మేన‌ని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement