Saturday, April 20, 2024

కరోనా కొత్త వేరియంట్ తో ప్రమాదం లేదు : హరీశ్ రావు

కరోనా కొత్త వేరియంట్ తో ఏమి ప్రమాదం లేదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రూ.100కోట్లతో గాంధీ ఆస్పత్రిని డెవలప్ చేస్తున్నామన్నారు. రూ.30కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధునాతన యంత్రాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రైనేజీ, ఫైర్ సేఫ్టీ, డ్రింకింగ్ వాటర్, పారిశుధ్య వ్యవస్థను మెరుగు పరుస్తామన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు డబ్బులు అయిపోగొట్టుకోవద్దన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించడం భోగస్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement