Thursday, April 25, 2024

మద్యంలో కల్తీ… కిక్కెక్కడం లేదు: హోంమంత్రికి మందుబాబు ఫిర్యాదు

తాను తాగిన కల్తీ మద్యంతో అస్సలు కిక్కివ్వడం లేదంటూ ఓ మందుబాబు ఏకంగా హోంమంత్రికే ఫిర్యాదు చేశాడు. రెండు బాటిళ్ల మద్యం సేవించినా.. అతడు మత్తు ఎక్కలేదని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో జరిగిందీ సంఘటన. వివరాల్లోకి వెళ్లితే.. ఉజ్జయినిలోని బహదూర్‌గంజ్‌కు చెందిన లోకేంద్ర సాథియా అనే వ్యక్తి ఏప్రిల్ 12న నాలుగు క్వార్టర్ల దేశీ మద్యం కొనుగోలు చేశాడు. స్నేహితుడితో కలిసి రెండు సీసాల మద్యం సేవించాడు. అయినప్పటికీ కిక్కు ఎక్కకపోవడంతో కల్తీ జరిగినట్టు అనుమానించాడు. 

మద్యానికి బానిసైన లోకేశ్ మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకి ఫిర్యాదు చేయడమే కాకుండా నకిలీ మద్యం కావొచ్చని అనుమానిస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుకు సాక్ష్యంగా మిగిలిన మద్యం బాటిళ్లను కూడా సమర్పించాడు. తాను కొనుగోలు చేసిన మద్యంలో కల్తీ జరిగిందని ఆరోపించాడు. మద్యంలో నీరు ఉందని ఆరోపిస్తూ, మిగిలిన రెండు మద్యం బాటిళ్లను సదరు వ్యక్తి ఎక్సైజ్ అధికారులకు అప్పగించి.. అందులో ఉన్న వాటిని సరిచూసుకుని సంబంధిత కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement