Thursday, April 18, 2024

సినిమాల‌పై నో కామెంట్స్.. బిజెపి నేత‌ల‌కు ప్ర‌ధాని మోడీ సూచ‌న‌

సినిమాల‌పై కామెంట్స్ చేయ‌వ‌ద్ద‌ని బిజెపి నేత‌ల‌కు సూచ‌న చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.వారు చేసే కామెంట్లను మీడియా హైలెట్ చేస్తోందని, టీవీలు రోజంతా ప్రసారం చేస్తున్నాయని మోడీ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న మోడీ.. పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అనవసర వ్యాఖ్యలు చేసి ప్రచారంలో ఉండొద్దని హితవు పలికారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమాపై వివాదం రేగడం తెలిసిందే! ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని పలువురు నాయకులు, ఇతర సంఘాలు పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హీరోయిన్ కాషాయ రంగు దుస్తులు ధరించడంపై బీజేపీ నేతలు పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వంటి నేతలు చేసిన వ్యాఖ్యలను మీడియా హైలెట్ చేసింది. ఈ క్రమంలోనే మోడీ తాజాగా పార్టీ నేతలకు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement