Thursday, April 25, 2024

Nizamabad: మా సంతకాలు పోర్జరీ చేసారు: ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఫిర్యాదు

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ల ఘట్టం పూర్తి కాగానే ఫిర్యాదుల పర్వం ప్రారంభం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్.. తమ సంతకాలు పోర్జరీ చేసారు అని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 31 డివిజన్ కార్పొరేటర్ రజియా సుల్తానా, నందిపేట్ 3 ఎంపీటీసీ ఎర్రం నవనీతలు ఆరోపించారు. నామినేషన్ ల పరిశీలన ప్రారంభం కాగానే కార్పొరేటర్, ఎంపీటీసీలు బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేసారు. ఇప్పుడు ఈ అంశం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్ బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యం అయింది. ఈ క్రమంలో సంతకాలు పోర్జరీ అంశం రాజకీయంగా సంచలనమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement