Thursday, April 25, 2024

తొమ్మిద‌వ నిజాంగా.. అజ్మ‌త్ జా

ఇటీవ‌లే చివ‌రి నిజాం ముక‌ర్ర‌మ్ జా క‌న్నుమూశారు. దీంతో నిజాం వారసుడిగా, తొమ్మిదవ నిజాంగా అజ్మత్ జాను కుటుంబసభ్యులు ఎంపిక చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం ట్రస్టీల మధ్య సాంప్రదాయ పద్ధతిలో ప్రక్రియను నిర్వహించామని చౌమొహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ముకర్రమ్ జా కుమారుడైన అజ్మత్ జా లండన్ లోనే ప్రాథమిక, ఉన్నత చదువులు చదివారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో పట్టా పొందిన ఆయన… ఫొటోగ్రఫీనే వృత్తిగా ఎంచుకున్నారు. అంతేకాదు హాలీవుడ్ లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా, సినిమాటోగ్రాఫర్ గా విధులు నిర్వహించారు. స్టీవెన్ స్పిల్ బర్గ్, రిచర్డ్ అటెన్ బరో తదితర దిగ్గజాలతో కలిసి పని చేశారు. తన తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వికుల నివాసంలో ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement