కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కె.తిమ్మాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని నవవధువు రేణుక ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితమే వీరేష్తో రేణుకకు వివాహం జరిగింది. ఉగాది పండుగకు పుట్టింటికి వెళ్లి అత్తారింటికి వచ్చింది. అనంతరం రేణుక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రేణుక ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement