Friday, April 19, 2024

ప్రధాని మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఇతర దేశాల అధినేతలు హాజరైయ్యారు. ఈ క్రమంలో ఈరోజు సదస్సు ప్రారంభంకాగా.. మోడీతో రిషి సునాక్ సమావేశమయ్యారు. అయితే, జీ20 సదస్సులో భాగంగా భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు రేపు జరగనున్నాయని సమాచారం.

రిషి సునాక్ భారత సంతతికి చెందిన వ్యక్తి. భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో తమ తమ దేశాల అధికార ప్రతినిధులతో కలిసి మోడీ, సునాక్ పాలుపంచుకోనున్నారు. అయితే ఒకే దేశానికి చెందిన నేతలు కావడంతో వీరిద్దరూ తొలి రోజే తారసపడిన సందర్భంగా పలకరించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement