Thursday, April 18, 2024

Naxal killed: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మవోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భరందాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మృతదేహంతోపాటు భారీగా మావోయిస్టు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు.

భరందా పోలీస్ స్టేషన్‌కు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున 1.30 గంటలకు కాల్పులు జరిగాయని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్ తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన భారీ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. చనిపోయిన మవోయిస్టును ఇంకా గుర్తించాల్సి ఉందని జైస్వాల్ తెలిపారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. కాగా, వారం రోజుల్లో వ్యవధిలో భద్రతా దళాల మధ్య జరిగిన నాలుగు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు నక్సల్స్ మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement